యూపీలో మరో దారుణం

ABN , First Publish Date - 2021-02-27T17:16:19+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది...

యూపీలో మరో దారుణం

సీతాపూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. పుట్టింటికి బయలుదేరిన ఓ మహిళకు తన ఎడ్లబండిపై లిఫ్టు ఇస్తామని చెప్పి తండ్రీకొడుకులు ఎక్కించుకొని, దారి మధ్యలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి, నిప్పంటించిన ఘటన యూపీలోని సీతాపూర్ సమీపంలోని మిష్రీక్ ప్రాంతంలో జరిగింది. ఓ మహిళ మిష్రీక్ గ్రామం నుంచి తన పుట్టిన గ్రామమైన సిధూలీకి వెళుతుండగా ఎడ్లబండి నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెకు లిఫ్టు ఇస్తామని ఎక్కించుకున్నారు. దారి మధ్యలో తండ్రీకొడుకులు మహిళపై అత్యాచారం చేసి నిప్పటించి పారిపోయారు. 30 శాతం కాలిన గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించారు.మహిళ ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఈ కేసులో నిందితులైన తండ్రీ కొడుకులను అరెస్టు చేశామని సీతాపూర్ పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-02-27T17:16:19+05:30 IST