నవీముంబైలో దారుణం...

ABN , First Publish Date - 2020-02-27T13:44:06+05:30 IST

కేవలం రెండు గంటల్లో 19 ఏళ్ల ఓ యువతిపై వేర్వేరుగా సాగిన రెండు ఘటనల్లో ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన దారుణ ఉదంతం...

నవీముంబైలో దారుణం...

రెండు గంటల్లో ఓ యువతిపై వేర్వేరుగా ముగ్గురు కామాంధుల అఘాయిత్యం

నవీ ముంబై : కేవలం రెండు గంటల్లో 19 ఏళ్ల ఓ యువతిపై వేర్వేరుగా సాగిన రెండు ఘటనల్లో ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన దారుణ ఉదంతం మహారాష్ట్రలోని నవీ ముంబై నగరంలో వెలుగుచూసింది. 19 ఏళ్ల ఓ యువతి తన బంధువులతో కలిసి ఘట్‌కోపర్ రైల్వేస్టేషను వద్ద సబర్బన్ రైలు ఎక్కలేక పోయింది. ఒక రైలు బదులు మరో రైలు ఎక్కిన యువతి రాత్రికి థానేలోని ముంబ్రా రైల్వేస్టేషనుకు వచ్చి అక్కడే నిద్రపోయింది. అనంతరం ఆ యువతి ముంబ్రా నుంచి మరో రైలు ఎక్కి దివా రైల్వేస్టేషనులో దిగింది. దివా రైల్వేస్టేషనులో దిగిన యువతి డబ్బు కోసం తన ముక్కు పుడకను విక్రయించేందుకు మహిళా యాచకురాలి సహాయం కోరింది. యువతి రాత్రి వరకు యత్నించినా ముక్కుపుడక విక్రయించలేక స్టేషను బయటకు దూరంగా రోడ్డుపైకి వచ్చింది.


తిరిగి రైల్వేస్టేషనుకు వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కగా, ఆ ఆటో డ్రైవరు ఆమెను నవీముంబైలోని ఓ నిర్మానుష్య భవనంలోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసి దేవాలయం వద్ద వదిలి వెళ్లాడు. అనంతరం ఇద్దరు స్కూటరిస్టులు ఆమెను రైల్వేస్టేషనుకు తీసుకువెళతామని చెప్పి ఘన్సోలీ ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై ఇద్దరు అత్యాచారం చేసి పారిపోయారు. బాధిత యువతి ఫిర్యాదు మేర నవీ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు కామాంధులను అరెస్టు చేశారు. బాధిత యువతిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించారు. 

Updated Date - 2020-02-27T13:44:06+05:30 IST