విదేశాల్లో భర్త.. మరొకరికి దగ్గరైన మహిళ.. అత్తమామలు తనకు అడ్డుగా ఉన్నారని ఆమె అతి కిరాతకంగా..
ABN , First Publish Date - 2022-01-04T03:23:12+05:30 IST
తన అక్రమసంబంధానికి అడ్డుపడుతున్నారన్న కారణంతో ఓ మహిళ తన అత్తమామలను అతి దారుణంగా హత్య చేసింది. ఇంట్లో దొంగలు పడి వారిని హత్య చేశారని పోలీసులను మభ్య పెట్టబోయిన ఆమె చివరికి అడ్డంగా దొరికిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: తన అక్రమసంబంధానికి అడ్డుపడుతున్నారన్న కారణంతో ఓ మహిళ తన అత్తమామలను అతి దారుణంగా హత్య చేయించింది. ఇంట్లో దొంగలు పడి వారిని హత్య చేశారని పోలీసులను మభ్య పెట్టబోయిన ఆమె చివరికి అడ్డంగా దొరికిపోయింది. పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జాజా గ్రామానికి చెందిన రవీందర్ పెళ్లైన కొంత కాలానికే విదేశాలకు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడూ భారత్కు వచ్చి వెళుతుంటాడు. అతడి భార్య మన్దీప్ సింగ్ అత్తారింట్లోనే నివసిస్తోంది. అయితే.. కొంత కాలం క్రితం ఆమె మరో వ్యక్తికి దగ్గరైంది. రాత్రిళ్లు అందరూ నిద్రపోయాక తన బాయ్ఫ్రెండ్తో గంటలతరబడి మాట్లాడేది. అయితే.. విషయం అత్తమామలకు తెలియడంతో తీరు మార్చుకోమంటూ వారు కోడలిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో.. ఆమె వారిని అంతమొందించేందుకు నిర్ణయించుకుంది.
గతేడాది డిసెంబర్లోనే ఆమె భర్త భారత్కు వచ్చాడు. ఈ క్రమంలో మన్దీప్ కొత్త ఏడాది జనవరి ఒకటిన తన పథకం అమలు పరిచింది. ఆ రోజు భర్త బయటకు వెళ్లిన కొన్ని గంటల తరువాత.. తన బాయ్ఫ్రెండ్ను పిలిపించుకుని అతడితో అత్తమామలను హత్య చేయించింది. ఆ తరువాత బెడ్ రూంలోనే వారి మృతదేహాలకు నిప్పటించింది. ఆ తరువాత.. కూర్చిలో కూర్చూని బాయ్ఫ్రెండ్ సాయంతో తాళ్లతో కట్టేసుకుంది. భర్త వచ్చే సరికి..బాయ్ఫ్రెండ్ గోడ దూకి పాపిపోతుండటం అతడి కంట పడింది. ఇంట్లోకెళ్లి చూస్తే తల్లిదండ్రుల మృతదేహాలు కాలుతూ కనిపించాయి. దీంతో.. షాకైపోయిన అతడు వెంటనే పోలీసులను సంప్రదించారు. తమ ఇంట్లో దొంగలు పడి ఈ దారుణానికి పాల్పడ్డారని మన్దీప్ పోలీసులకు తెలిపింది. అయితే.. నేరం జరిగిన తీరు చూసిన పోలీసులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనకు అడ్డుపడుతున్నారన్న కారణంతో మన్దీప్ ఈ హత్య చేసినట్టు తేల్చారు. అంతేకాకుండా.. ఆమె బాయ్ఫ్రెండ్ రవీందర్ ఇంట్లోంచి దొంగిలించిన నగలు, నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.