కూతురి హత్యకు తల్లి రూ.50వేల సుపారి

ABN , First Publish Date - 2021-01-18T12:22:32+05:30 IST

అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తుందని కన్న కుమార్తెను హత్య చేయించేందుకు సాక్షాత్తూ తల్లి ఓ వ్యక్తికి రూ.50వేలను సుపారిగా ఇచ్చిన ఉదంతం....

కూతురి హత్యకు తల్లి రూ.50వేల సుపారి

బాలాసోర్ (ఒడిశా): అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తుందని కన్న కుమార్తెను హత్య చేయించేందుకు సాక్షాత్తూ తల్లి ఓ వ్యక్తికి రూ.50వేలను సుపారిగా ఇచ్చిన ఉదంతం ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో వెలుగుచూసింది. బాలాసోర్ జిల్లాకు చెందిన సుకిరిగిరి కుమార్తె షిబానీనాయక్ (36) అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తోంది. తన కుమార్తెను అక్రమ మద్యం వ్యాపారం నుంచి నిరోధించడానికి తల్లి సుకురిగిరి చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కుమార్తె షిబానీనాయక్ ను హత్య చేయించేందుకు సుకురిగిరి ప్రమోద్ జెనా అనే హంతకుడికి రూ.50వేలతో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు కిల్లరుకు సుకురిగిరి 8వేల అడ్వాన్సు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కుమార్తె హత్యకు పథకం పన్ని కిల్లరుకు సుపారి ఇచ్చిన తల్లిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2021-01-18T12:22:32+05:30 IST