తల లేకుండా చెట్ల పొదల్లో బయటపడ్డ యువతి మృతదేహం.. పక్కనే మద్యం బాటిళ్లతోపాటు కనిపించిందో బ్యాగ్.. అందులో..

ABN , First Publish Date - 2021-10-12T15:37:20+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.

తల లేకుండా చెట్ల పొదల్లో బయటపడ్డ యువతి మృతదేహం.. పక్కనే మద్యం బాటిళ్లతోపాటు కనిపించిందో బ్యాగ్.. అందులో..

ఛత్తీస్‌గఢ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. రాష్ట్రంలోని జాంజ్‌గీర్‌లో తల లేకుండా చెట్ల పొదల్లో ఒక యువతి మృతదేహం కనిపించింది. ఇప్పటివరకూ ఆ మహిళ తల దొరకలేదు. కాగా ఆ మృతదేహం పక్కన పడివున్న మద్యం బాటిళ్లు, ఒక బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో ఉన్న ఆధార్ కార్డు, కొన్ని వస్తువుల ఆధారంగా పోలీసులు ఆ మహిళను గుర్తించారు. మృతురాలు సుమారు రెండు నెలలుగా కనిపించడం లేదు. ఇప్పుడు గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం కనిపించింది. 


ఈ ఘటన ముల్ములా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నవాగావ్ వెళ్లేదారిలో గల చెట్ల పొదల్లో ఆ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ లభ్యమైన ఆధార్ కార్డు సాయంతో మృతురాలిని రాజకుమారి ఖరె(46)గా గుర్తించారు. చాలా రోజుల క్రితమే ఈ మహిళను హత్యచేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పక్కన ఐదు మద్యం బాటిళ్లు కనిపించాయి. నిందితుడు మరికొంతమందితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మహిళ గత రెండు నెలలుగా ఎక్కడ ఉన్నదో పోలీసులకు కూడా తెలియలేదు. దీంతో వారు మృతురాలి ఇంటి చుట్టుపక్కలవారిని అడిగి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.


మహిళ మృతదేహం పక్కన లభ్యమైన బ్యాగులో  అకల్తారా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదుకు సంబంధించిన కాపీ లభ్యమయ్యింది. దానిలో ఆ మహిళ తన ఇంటిలో చోరీ జరగిందని, నలుగురిపై అనుమానం ఉందని పేర్కొంది. కాగా రాజకుమారి భర్త సుమారు రెండేళ్ల క్రితం మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమారులు. వారు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. గ్రామంలో మృతురాలు రాజకుమారి ఒంటరిగా ఉండేది. పోలీసులు ఆమె కుమారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వారు ఇక్కడికి వచ్చిన తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించనున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు.

Updated Date - 2021-10-12T15:37:20+05:30 IST