నిర్జీవంగా పడి ఉన్న భర్త ముందే ప్రియుడిని పెళ్లాడిని యువతి.. ఆ తరువాత ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-06T05:33:45+05:30 IST

ఆమె ఒక వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమించే భర్త ఉన్నా.. మరో యువకుడిని ప్రేమించింది. భర్తను వదిలి అతనితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ సమాజం ఏమంటుందో అని భయంతో చేయరాని పని చేసింది. భర్త ముందే ప్రియుడిచేత తాళి కట్టించుకుంది...

నిర్జీవంగా పడి ఉన్న భర్త ముందే ప్రియుడిని పెళ్లాడిని యువతి.. ఆ తరువాత ఏం చేసిందంటే..

ఆమె ఒక వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమించే భర్త ఉన్నా.. మరో యువకుడిని ప్రేమించింది. భర్తను వదిలి అతనితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ సమాజం ఏమంటుందో అని భయంతో చేయరాని పని చేసింది. భర్త ముందే ప్రియుడిచేత తాళి కట్టించుకుంది. కానీ ఆ సమయంలో ఆమె భర్త సజీవంగా లేడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో జరిగింది.


వివరాల్లికి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సోనభద్ర జిల్లాలో నివసించే మమత(25) అనే యువతికి నాలుగేళ్ల క్రితం రాజీవ్ అనే యువకుడితో వివాహం జరిగింది. రాజీవ్ ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లల్ని బాగా చూసుకునేవాడు. జీవితం సాఫీగా గడిచిపోతుందనుకుంటున్న సమయంలో మమతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు రాజీవ్‌కు తెలసింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇక రాజీవ్‌ను వదిలి తన ప్రియుడు లవకుశ్‌నే వివాహం చేసుకోవాలని మమత నిర్ణయం తీసుకుంది. 


ఒకరోజు రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నాక మమత తన ప్రియుడు లవకుశ్‌ని ఇంటికి పిలిచింది. ఆ సమయంలో రాజీవ్ నిద్రపోతున్నాడు. అప్పుడు మమత తన ప్రియుడి సహాయంతో ఇంట్లోని ఒక హోస్ పైప్(వాటర్ పైప్)తో భర్త గొంతుకి ఉరి వేసి హత్య చేసింది. రాజీవ్ చనిపోయాక అతని శవం సాక్షిగా ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. లవకుశ్ చేత మమత తన నుదుట కుంకుమ వేసుకుంది. ఆ తరువాత లవకుశ్ ఆమె మెడలో తాళి కట్టాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు పక్కనే ఉన్నారు.


మరుసటి రోజు ఉదయం పోలీసులు మమత ఇంటికి వచ్చారు. రాజీవ్‌ని ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. దానికి మమత సమాధానం చెబుతూ.. ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి తన భర్తను హత్య చేశారని చెప్పింది. ఆమె మాటలు నమ్మి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు కూడా చేశారు. కానీ దర్యాప్తు చేసేందుకు మరోసారి మమతను మళ్లీ ప్రశ్నించారు. ఈ సారి ఆమె నేరం జరిగిన తీరును మార్చి చెప్పింది. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. 


రాజీవ్ తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. చనీపోయేముందు రాజీవ్ తనతో మమతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు చెప్పాడని ఆయన పోలీసుల విచారణలో అన్నారు. దీంతో పోలీసులు మమత ప్రియుడు లవ్‌కుశ్ గురించి ఆరా తీశారు. పోలీసులు తనకోసం వెతుకుతున్నారని తెలిసి లవ్‌కుశ్ పారీపోతుండగా.. పోలీసులు అతడిని రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులు లవ్‌కుశ్‌ని గట్టిగా విచారణ చేయగా.. అతను హత్య ఎలా జరిగిందో వివరించాడు. ప్రస్తుతం పోలీసులు మమత, ఆమె ప్రియుడు లవ్‌కుశ్‌ని రాజీవ్ హత్య కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. 


Updated Date - 2022-02-06T05:33:45+05:30 IST