వితంతువు, ఆమె స్నేహితుడికి శిరోముండనం చేసి ఊరేగించిన గ్రామస్థులు

ABN , First Publish Date - 2020-08-27T17:21:46+05:30 IST

ఓ వితంతువు, దివ్యాంగుడు సహజీవనం చేస్తున్నారనే ఆగ్రహంతో గ్రామస్థులు వారిద్దరికి శిరోముండనం చేసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించిన ఘటన....

వితంతువు, ఆమె స్నేహితుడికి శిరోముండనం చేసి ఊరేగించిన గ్రామస్థులు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఓ వితంతువు, దివ్యాంగుడు సహజీవనం చేస్తున్నారనే ఆగ్రహంతో గ్రామస్థులు వారిద్దరికి శిరోముండనం చేసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ గ్రామంలో జరిగింది. కాన్పూర్  నగరానికి 100కిలోమీటర్లదూరంలోని గురసహాయ్ గుంజ్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఓ దివ్వాంగుడు వితంతువుతో సహజీవనం చేస్తున్నాడు. దీనిపై ఆగ్రహించిన వితంతువు కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారిద్దరికి శిరోముండనం చేసి, మెడలో చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేర పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-08-27T17:21:46+05:30 IST