పదేళ్ల కొడుకుతో ఒంటరిగా ఉంటున్న మహిళ.. రాత్రి 11.30 గంటలకు తలుపు తట్టిన శబ్దం.. చివరకు..

ABN , First Publish Date - 2021-07-17T01:30:14+05:30 IST

పదేళ్ల కొడుకుతో ఒంటరిగా ఉంటోందా తల్లి. కరోనా కష్టకాలంలో ఉన్న ఊళ్లో సరైన ఉపాధి లేకపోవడంతో ఆమె భర్త గుజరాత్ వెళ్లి పని చేస్తున్నాడు.

పదేళ్ల కొడుకుతో ఒంటరిగా ఉంటున్న మహిళ..  రాత్రి 11.30 గంటలకు తలుపు తట్టిన శబ్దం.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: పదేళ్ల కొడుకుతో ఒంటరిగా ఉంటోందా తల్లి. కరోనా కష్టకాలంలో ఉన్న ఊళ్లో సరైన ఉపాధి లేకపోవడంతో ఆమె భర్త గుజరాత్ వెళ్లి పని చేస్తున్నాడు. ఇలా వెళ్లడమే అతని భార్యకు తిప్పలు తెచ్చింది. భర్త లేకపోవడంతో ఆమె బిడ్డతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11న బిడ్డతో కలిసి ఆమె నిద్రపోతోంది. రాత్రి సుమారు 11గంటల ప్రాంతంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇంత రాత్రి వేళ ఎవరొచ్చారా? అని అనుమానంగా వెళ్లి తలుపు తీసిన ఆమెకు పొరుగింట్లో ఉండే ఇద్దరు సోదరులు కనిపించారు. వాళ్ల పేర్లు రూప్‌సింహ్, హిమ్మత్‌సింహ్. ప్రతిరోజూ ఎదురయ్యే వాళ్లే కావడంతో ఆమె భయపడలేదు. ఇంత చీకట్లో ఎందుకొచ్చారా? అనుకుంటూ ఏం కావాలని ప్రశ్నించింది.


అయితే అప్పటికే మద్యం మత్తులో మునిగిపోయి ఉన్న ఆ సోదరులు ఆమెపై దాడికి దిగారు. వాళ్లు తనపై దాడి చేయగానే ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఈ సోదరులు వెంటనే ఆమె నోరు నొక్కేశారు. ఆపై ఆమెను ఘోరంగా బలాత్కరించారు. వాళ్ల కబంద హస్తాల నుంచి తప్పించుకోవడానికి గిలగిల్లాడిన ఆ మహిళ కాసేపటికి స్పృహకోల్పోయింది. అయినా వదలకుండా అత్యాచారం చేసిన ఆ సోదరులు.. ఆ తర్వాత ఎప్పటికో ఆమెను వదిలి పరారయ్యారు. ఉదయం స్పృహలోకి వచ్చిన ఆమె.. చుట్టుపక్కల వారికి, భర్తకు విషయం చెప్పి భోరుమంది. పోలీసుల వద్దకు వెళ్దామంటే బిడ్డకు ఏమైనా హాని జరిగే ప్రమాదం ఉందని భయపడింది. అయితే భర్త, కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే పరారీలో ఉన్న రూప్‌సింహ్ సోదరులు ఎక్కడ ఉన్నదీ ఇంకా తెలియలేదు.

Updated Date - 2021-07-17T01:30:14+05:30 IST