రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-06-18T05:01:04+05:30 IST

మండలంలోని మారెళ్లమడక గ్రామం కొండ వాండ్లపల్లెకు చెందిన కేసినేని జయమ్మ (45) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మృతిచెందిన జయమ్మ(ఫైల్‌)

చక్రాయపేట, జూన్‌ 17: మండలంలోని మారెళ్లమడక గ్రామం కొండ వాండ్లపల్లెకు చెందిన కేసినేని జయమ్మ (45) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలతిమ్మయ్యగారిపల్లెలో జయమ్మ బంధువు మృతి చెందడంతో చూసేందుకు గురువారం ఉదయం బైకుపై వెళ్తుండగా దేవరగుట్ట సమీపాన దశరథ మహారాజు గుడి వద్దకు రాగానే బైకుపై కూర్చున్న జయమ్మ అదుపుతప్పి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో వేంపల్లెకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.


Updated Date - 2021-06-18T05:01:04+05:30 IST