బాలుడి పుట్టిన రోజు వేడుకలో కాల్పులు.. తల్లి మృతి

ABN , First Publish Date - 2021-12-24T02:03:24+05:30 IST

బాలుడి పుట్టిన రోజు వేడుకలో కాల్పులు.. తల్లి మృతి

బాలుడి పుట్టిన రోజు వేడుకలో కాల్పులు.. తల్లి మృతి

బరేలీ: పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. కుమారుడి పుట్టినరోజు వేడుకలో కాల్పులు జరగడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లా బరేలీ పట్టణంలో జరిగింది. తన మూడేళ్ల కుమారుడి పుట్టిన రోజు వేడుకలో కేక్ కట్ చేస్తుండగా ఈ సమయంలో పక్కనే ఉన్న బంధువు ప్రమాదవశాత్తూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 28 సంవత్సరాల అనిత వర్మ మృతి చెందింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు. అనితకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రదీప్ వర్మ అనే రైతుతో ఆమెకు వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తమ కుమారుడి పుట్టిన రోజు వేడుక కోసం ఈ జంట 100 మంది అతిథులను ఆహ్వానించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బంధు జైరాం వర్మ ప్రదీప్ కుటుంబానికి సన్నిహితంగా ఉండడంతో అతన్ని కూడా ఆహ్వానించారు. మద్యం మత్తులో మూడేళ్ల బాలుడి పుట్టిన రోజు వేడుకలో జైరాం వర్మ గన్ తో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపామని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-12-24T02:03:24+05:30 IST