ఆటో ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2021-05-08T04:59:05+05:30 IST

మండలంలోని కెల్ల గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గుత్తి రాములమ్మ(34) మృతి చెందారు.

ఆటో ఢీకొని మహిళ మృతి

గుర్ల, మే 7: మండలంలోని కెల్ల గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గుత్తి రాములమ్మ(34) మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాములమ్మ తన భర్త పైడిరాజుతో స్కూటీపై గ్రామంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం వెళుతుండగా, అదే గ్రామాని కి చెందిన ఆటో ఎదురుగా వస్తోంది. ప్రమాదవశాత్తు రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో స్కూటీపై ఉన్న రాములమ్మ రోడ్డుపై పడడంతో దెబ్బలు తగిలాయి. వెంటనే విశాఖపట్ట ణం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ సంఘటనపై గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-05-08T04:59:05+05:30 IST