సెప్టిక్‌ ట్యాంకర్‌ తగిలి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-05-16T07:10:05+05:30 IST

: సెప్టిక్‌ ట్యాంకర్‌ ఢీ కొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం...

సెప్టిక్‌ ట్యాంకర్‌ తగిలి మహిళ మృతి
లోడే రేణుక

తిరుమలగిరి రూరల్‌, మే 15: సెప్టిక్‌ ట్యాంకర్‌ ఢీ కొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం... తొండ గ్రామానికి చెందిన లోడే రేణుక(28) ఆదివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్‌ తీసుకొని ఇంటికి రావడానికి రోడ్డు దాటుతుండగా తొర్రూరు నుంచి తిరుమలగిరి వైపు వస్తుండగా సెప్టిక్‌ ట్యాంకర్‌ అతి వేగంతో ఢీకొంది. దీంతో తలకు తీవ్రమైన రేణుకను కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింంది. రేణుకకు భర్తఉ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  రేణుక భర్త రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఏఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.  



Updated Date - 2022-05-16T07:10:05+05:30 IST