భర్త తాగుబోతని.. ప్రియుడితో పరార్.. అతనూ మోసం చేయడంతో ఆత్మహత్యాయత్నం.... ఇంతలో ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2021-10-09T17:00:28+05:30 IST

మద్యం అలవాటుతో పాటు అక్రమ సంబంధాలు...

భర్త తాగుబోతని.. ప్రియుడితో పరార్.. అతనూ మోసం చేయడంతో ఆత్మహత్యాయత్నం.... ఇంతలో ఊహించని విధంగా..

మద్యం అలవాటుతో పాటు అక్రమ సంబంధాలు మనిషిని ఎంతటి దీనస్థితికైనా దిగజారుస్తాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. రీవా పట్టణానికి చెందిన ఒక మహిళ ఒక వంతెనపై నుంచి నదిలోకి దూకింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళను మొదట ఆమె భర్త, తరువాత ప్రేమికుడు మోసం చేశారు. ఈ నేపధ్యంలో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే నదిలో ఈత కొడుతున్న కొందరు యువకులు, పడవ నడిపే వ్యక్తి సాయంతో ఆమెను రక్షించారు. కాగా బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం ఆమెను... ఆమె ప్రియడే మరో వ్యక్తి సాయంతో నదిలోకి తోయించాడని ఆరోపించింది. 


కాగా 26 ఏళ్ల ఆ మహిళ... యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కుటుంబ సభ్యులతో పాటు ఉండేది. ఆమెకు కొన్నేళ్ల క్రితం ఒక యువకునితో వివాహమయ్యింది. అయితే భర్త తాగుబోతు కావడంతో ఆమె పలు ఇబ్బందులను ఎదుర్కొంది. భర్త ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో, ఆమె కూలి పనులకు వెళ్లింది. ఈ నేపధ్యంలో ఆమెకు మేస్త్రీ పనిచేసే గోలూ సాకేత్‌తో పరిచయమయ్యింది. తరువాత అది ప్రేమగా మారడంతో ఆమె అతనితో పాటు ఉండసాగింది. అయితే ఇటీవల ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని వారిని ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో గోలూ సాకేత్ ఆమెను ఎక్కడికైనా పొమ్మన్నాడు. గతంలో భర్త చేతిలో, ఇప్పుడు ప్రియుని చేతిలో మోసపోయిన ఆమె మరో గత్యంతరం లేక నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బాధితురాలి గోడు విన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని అమె పుట్టింటికి తరలించారు. 

Updated Date - 2021-10-09T17:00:28+05:30 IST