మాజీ భర్తను కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన మహిళ.. ఆమెపై మాజీ భర్త ఎలా పగ తీర్చుకున్నాడంటే..

ABN , First Publish Date - 2022-04-13T18:33:18+05:30 IST

వారిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహమైంది.. పెళ్లైన ఏడాదికే అభిప్రాయ భేదాలు తలెత్తాయి.

మాజీ భర్తను కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన మహిళ.. ఆమెపై మాజీ భర్త ఎలా పగ తీర్చుకున్నాడంటే..

వారిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహమైంది.. పెళ్లైన ఏడాదికే అభిప్రాయ భేదాలు తలెత్తాయి.. గతేడాది కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు.. అయితే విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ దగ్గరయ్యాయి.. మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఆ మహిళకు మాజీ భర్త హామీ ఇచ్చాడు.. ఒంటరిగా కలుద్దామని చెప్పి హోటల్‌కు ఆహ్వానించాడు.. కూల్ డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి తాగించాడు.. అనంతరం ఆమెను అత్యాచారం చేశాడు.. ఆ ఘటనను వీడియో తీశాడు.. హోటల్ నుంచి బయటపడిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ బ్యుటీషియన్‌గా పని చేస్తోంది. ఆమెకు 2019లో వివాహం జరిగింది. అయితే అభిప్రాయ భేదాల కారణంగా 2021 ఆగస్ట్‌లో భర్త నుంచి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న నెల తర్వాత మాజీ భర్తతో ఆమెకు మళ్లీ స్నేహం చిగురించింది. ఇద్దరూ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకునేవారు. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు మాజీ భర్త ఉంగరం తొడిగి మళ్లీ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. 


ఈ నెల 9వ తేదీన ఆమెను హోటల్‌కు ఆహ్వానించాడు. ఆమెతో చాలా సేపు మాట్లాడాడు. కూల్ డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి ఆమె చేత తాగించాడు. అనంతరం ఆమెను అత్యాచారం చేశాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆమెను మళ్లీ వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-13T18:33:18+05:30 IST