పెళ్లి కోసం 80 కిలోమీటర్లు ఒంటరిగా నడిచిన 20 ఏళ్ల యువతి!

ABN , First Publish Date - 2020-05-23T23:11:55+05:30 IST

పెళ్లి కోసం ఓ యువతి ఒంటరిగా 80 కిలోమీటర్లు నడిచింది. ఎట్టకేలకు కాబోయే భర్తను చేరుకుని మనువాడింది

పెళ్లి కోసం 80 కిలోమీటర్లు ఒంటరిగా నడిచిన 20 ఏళ్ల యువతి!

లక్నో: పెళ్లి కోసం ఓ యువతి ఒంటరిగా 80 కిలోమీటర్లు నడిచింది. ఎట్టకేలకు కాబోయే భర్తను చేరుకుని మనువాడింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. కాన్పూరుకు చెందిన 20 ఏళ్ల యువతి గోల్డీకి కన్నౌజ్‌కు చెందిన యువకుడు వీరేంద్ర కుమార్ (23) ఈ నెల 4న వివాహం జరగాల్సి ఉంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. కరోనా కారణంగా ప్రజా రవాణా మూతబడడంతో ఇరు కుటుంబాల వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ఫోన్లో ఒకరికొకరు టచ్‌లోనే ఉన్నారు. 


కాన్పూరులోని లక్ష్మీపూర్ తాలూకాలో నివసించే గోల్డీ..  లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో కన్నౌజ్‌లోని బైసాపూర్‌లో నివసించే భర్త వీరేంద్ర కుమార్ ఇంటికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా నడక ప్రారంభించి ఎట్టకేలకు వీరేంద్ర ఇంటికి చేరుకుంది. అకస్మాత్తుగా ఇంటి వద్ద ప్రత్యక్షమైన గోల్డీని చూసిన వీరేంద్రకుమార్ కుటుంబ సభ్యులు షాకయ్యారు. తేరుకుని ఓ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరం పాటిస్తూనే వివాహం జరిపించారు. వధూవరులిద్దరూ మాస్కులు ధరించి మొత్తానికి వివాహ తంతుతో ఒక్కటయ్యారు.  

Updated Date - 2020-05-23T23:11:55+05:30 IST