కూతుళ్లను ప్రేమిస్తున్న ఇద్దరు కుర్రాళ్లతో కలిసి ఓ తల్లి మాస్టర్ ప్లాన్.. నలుగురినీ ఖతం చేయాలనుకుంది.. కానీ..

ABN , First Publish Date - 2022-05-19T23:05:49+05:30 IST

ఆ మహిళకు యుక్తవయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లున్నారు.. ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ కాలేజీలో చదివే యువకులతో ప్రేమలో పడ్డారు.

కూతుళ్లను ప్రేమిస్తున్న ఇద్దరు కుర్రాళ్లతో కలిసి ఓ తల్లి మాస్టర్ ప్లాన్.. నలుగురినీ ఖతం చేయాలనుకుంది.. కానీ..

ఆ మహిళకు యుక్తవయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లున్నారు.. ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ కాలేజీలో చదివే యువకులతో ప్రేమలో పడ్డారు.. వాళ్లనే పెళ్లి చేసుకోవాలనుకుని కుటుంబ సభ్యులకు చెప్పారు.. కూతుళ్ల ప్రేమను తల్లి అంగీకరించింది.. అయితే ఆ ప్రేమ పెళ్లిళ్లకు తండ్రి, ఇద్దరు బాబాయిలు, నాన్నమ్మ అంగీకరించలేదు.. దీంతో ఆ కూతుళ్లు తమ తల్లి, బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి ఆ నలుగురినీ చంపేందుకు స్కెచ్ వేశారు.. వారు తినే ఆహారంలో విషం కలిపేశారు.. చివరకు కటకటాల పాలయ్యారు. 

ఇది కూడా చదవండి..

మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. విషయం తెలిసి నేరుగా వధువు ఇంటికి వెళ్లిన ప్రేయసి.. చివరకు ఊహించని ట్విస్ట్..!


గ్రేటర్ నోయిడాకు చెందిన రాజ‌కుమారి అనే మహిళకు జ్యోతి, అర్చన అనే కూతుళ్లు ఉన్నారు. వారిద్దరూ అభిషేక్, దీపక్ అనే యువకులతో ప్రేమలో పడ్డారు. వారినే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కూతుళ్ల ప్రేమను తల్లి రాజకుమారి అంగీకరించింది. అయితే రాజకుమారి భర్త దేవేంద్ర, అతని ఇద్దరు సోదరులు, తల్లి ఆ పెళ్లిళ్లకు అంగీకరించలేదు. దీంతో కూతుళ్లు, వారి ప్రియులతో కలిసి భర్త కుటుంబాన్ని చంపేందుకు రాజకుమారి స్కెచ్ వేసింది. భర్త, మరుదులు, అత్తగారు తినే ఆహారంలో విషం కలిపేసింది. 


ఆ ఆహరం తిన్న వారిలో ముగ్గురు స్పృహ కోల్పోయారు. దేవేంద్ర సోదరుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతను అందరినీ హాస్పిటల్‌కు తరలించాడు. కేసు విచారణలో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజకుమారిని, ఆమె కూతుళ్లు జ్యోతి, అర్చనతో పాటు అభిషేక్, దీపక్‌లను కూడా అరెస్ట్ చేశారు.  

Updated Date - 2022-05-19T23:05:49+05:30 IST