మరిదితో వదిన ప్రేమాయణం.. భర్తకు తెలిసిందని ఇద్దరూ ఇంటి నుంచి ఎస్కేప్.. 45 రోజుల తర్వాత..

ABN , First Publish Date - 2021-08-11T17:14:27+05:30 IST

ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఆమె భర్త గురించి అన్ని నిజాలు తెలుసుకుంది..

మరిదితో వదిన ప్రేమాయణం.. భర్తకు తెలిసిందని ఇద్దరూ ఇంటి నుంచి ఎస్కేప్.. 45 రోజుల తర్వాత..

ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఆమె భర్త గురించి అన్ని నిజాలు తెలుసుకుంది.. అతనికి అంతకు ముందే పెళ్లైందని తెలిసినా సర్దుకుపోదామనుకుంది.. అయితే భర్త, అత్త, మామ కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.. ఆ సమయంలో మరిది ఆమెకు బాసటగా నిలిచాడు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. వారి సంబంధం గురించి భర్తకు తెలియడంతో ఇంటి నుంచి పారిపోయారు.. 45 రోజుల తర్వాత తిరిగి వచ్చారు.. అయితే వచ్చిన రోజే ఇద్దరూ విషం తాగేశారు.. బీహార్‌లోని నలందా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


చక్‌జైనా గ్రామానికి చెందిన రాకేష్‌ను షబ్నం కుమారి ఏడాది క్రితం వివాహం చేసుకుంది. అయితే అప్పటికే రాకేష్‌కు మరో మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న షబ్నం.. రాకేష్‌తో గొడవపడేది. మొదటి వివాహం గురించి షబ్నం గొడవ చేయడంతో ఆగ్రహం చెందిన రాకేష్, అతని తల్లి, తండ్రి కట్నం గురించి అడగడం మొదలుపెట్టారు. అదనపు కట్నం తీసుకు రమ్మని వేధించడం ప్రారంభించారు. అలాంటి సమయంలో షబ్నంకు రాకేష్ సోదరుడు కుందన్ కుమార్ బాసటగా నిలిచాడు. వదినకు మద్దతు పలుకుతూ తల్లిని, తండ్రిని ఎదురించేవాడు. ఆ క్రమంలో కుందన్, షబ్నం మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం రాకేష్‌కు తెలియడంతో కుందన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి వేరే ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా షబ్నం అక్కడకు వెళ్లేది. 


ఆ ఇద్దరిని చూసిన రాకేష్ వారిని చితకబాదాడు. తర్వాతి రోజు వారిద్దరూ కలిసి ఆ ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో రాకేష్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఫిర్యాదు గురించి తెలుసుకున్న కుందన్, షబ్నం సోమవారం రాత్రి నలందాకు తిరిగి వచ్చారు. రాత్రి నలందా రైల్వే స్టేషన్‌లోనే ఇద్దరూ విషం తాగేశారు. ఉదయం వరకు అలాగే ఉండిపోయారు. మంగళవారం ఉదయం వారిని గమనించిన రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కుందన్ చనిపోగా.. షబ్నం ప్రాణాపాయ స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-08-11T17:14:27+05:30 IST