కృష్ణా నది ప్రాంతంలో మహిళ వినూత్న నిరసన
ABN , First Publish Date - 2022-04-26T23:38:33+05:30 IST
అత్తమామలు వేధిస్తున్నారంటూ మహిళ వినూత్న నిరసనకు దిగింది. న్యాయం చేయాలంటూ కృష్ణా నది ప్రాంతంలో ఆందోళన చేపట్టింది. ఈ ఘటన ఎన్టీఆర్..
కృష్ణా: అత్తమామలు వేధిస్తున్నారంటూ మహిళ వినూత్న నిరసనకు దిగింది. న్యాయం చేయాలంటూ కృష్ణా నది ప్రాంతంలో ఆందోళన చేపట్టింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో జరిగింది. ముప్పాళ్లకు చెందిన మహిళకు, చందాపురం గ్రామానికి చెందిన నరేంద్రతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పోలీస్ కేసుల వరకూ వెళ్లారు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తీరా ఇప్పుడు డబ్బు ఇవ్వకపోగా తమపై కోర్టుకు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు నిరసనకు దిగింది. న్యాయం జరిగే వరకూ కృష్ణా నదిలో నీళ్లు తాగి నిరసన చేపడతామని ఆమె తెలిపారు.