సంక్రాంతి పుణ్య స్నానానికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2021-01-15T02:34:19+05:30 IST

మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన 19 ఏళ్ల ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన వైనమిది...

సంక్రాంతి పుణ్య స్నానానికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం

బారిపాడ: మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన 19 ఏళ్ల ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన వైనమిది. గురువారం ఉదయం ఒడిశాలోని బారిపాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. సమీపంలోని ఓ నదిలో పుణ్యస్నానం కోసం వెళ్తున్న బాధితురాలు, ఆమె సోదరిని అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అనుసరిస్తూ వెళ్లారు. ఒక యువతి ఒడ్డున నిలబడి ఉండగా.. మరో యువతి స్నానం కోసం నీళ్లలోకి దిగింది. ఇంతలో నిందితులు ఆమెను అక్కడి నుంచే ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్దరూ పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు బారిపాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి పీఆర్ఎం మెడికల్ కాలేజి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు స్థానిక పోలీస్టేషన్ ఇంచార్జ్ బీరేంద్ర సేనాపతి వెల్లడించారు. 

Updated Date - 2021-01-15T02:34:19+05:30 IST