joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ABN , First Publish Date - 2022-09-22T12:59:42+05:30 IST

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ(Woman) ఉదంతం ఒడిశా(Odisha) రాష్ట్రంలోని సంబల్‌పూర్‌‌లో వెలుగుచూసింది....

joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

సంబల్‌పూర్‌(ఒడిశా): ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ(Woman) ఉదంతం ఒడిశా(Odisha) రాష్ట్రంలోని సంబల్‌పూర్‌‌లో వెలుగుచూసింది.ఒడిశాలోని సోనేపూర్ జిల్లా బంజిపాలి గ్రామానికి చెందిన కుని సునా అనే మహిళ నలుగురు పిల్లలకు(birth to four babies) జన్మనివ్వడం వారి కుటుంబంలో నాలుగురెట్ల ఆనందం వెల్లివిరిసింది.నవజాత శిశువుల్లో ముగ్గురు ఆడపిల్లలు కాగా, నాలుగో శిశువు మగబిడ్డ.తల్లీ, బిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన వార్త తెలియడంతో మహిళ కుటుంబీకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.


సంబల్‌పూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో ఇది మొదటి డెలివరీ.నవజాత శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో వారిని ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్‌లో ఉంచారు.ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించడం అరుదైన ఘటన. 


Updated Date - 2022-09-22T12:59:42+05:30 IST