మద్యం మత్తులో భర్త నిద్రపోగానే.. తెల్లారేదాకా 20 ఏళ్ల ప్రియుడితో ఫోన్‌లో ముచ్చట్లు.. భర్త హత్య కోసం ఏమేం చేసిందో తెలిసి పోలీసులే..

ABN , First Publish Date - 2021-10-28T01:13:26+05:30 IST

మద్యం మత్తులో పడి భర్త అలా నిద్రపోగానే ఆ మహిళ తన 20 ఏళ్ల ప్రియుడితో ఫోన్లో ముచ్చట్లు మొదలెట్టేది. తెల్లారేదాకా అలా మాట్లాడుతూనే ఉండేది. ఆ తరువాత రోజంతా నిద్రపోయేది. ఈ క్రమంలో

మద్యం మత్తులో భర్త నిద్రపోగానే.. తెల్లారేదాకా 20 ఏళ్ల ప్రియుడితో ఫోన్‌లో ముచ్చట్లు.. భర్త హత్య కోసం ఏమేం చేసిందో తెలిసి పోలీసులే..

ఇంటర్నెట్ డెస్క్: మద్యం మత్తులో పడి భర్త అలా నిద్రపోగానే ఆ మహిళ తన 20 ఏళ్ల ప్రియుడితో ఫోన్లో ముచ్చట్లు మొదలెట్టేది. తెల్లారేదాకా అలా మాట్లాడుతూనే ఉండేది. ఆ తరువాత  రోజంతా నిద్రపోయేది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగాయి. ఈ కుటుంబకలహం ఓ రోజున అనూహ్య మలుపు తిరిగింది..భర్త మరణానికి దారి తీసింది. అయితే.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలలుగా ఆమె ఏమేం చేసిందో తెలిసి పోలీసులే షాకైపోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది.


అక్కడి చినోర్ ప్రాంతంలో గత నెల 7న స్థానికులు ఓ కాలవలో శవం తేలుతున్న విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు మృతుడిని పరీక్షిత్ రావత్‌గా గుర్తించారు. అతడు కనపడటం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు దాఖలైనట్టు కూడా వారి దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులనే ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్యకు స్థానికంగా నివసించే ఓ యువకుడితో ఎఫైర్ ఉన్నట్టు బయటపడింది. మద్యానికి బానిసైన భర్త రాత్రిళ్లు నిద్రపోగానే ఆమె అతడితో ఫోన్లో మాట్లాడుతుండేది. 


ఇందుకోసం ఆమె ఏకంగా పది సిమ్ కార్డులను వినియోగించేది. భర్తకు అసలు ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకునేది. కొన్ని నెలల పాటు ఈ వ్యవహారం నడిచింది. అయితే.. పగలంతా భార్య ఇలా నిద్రపోతూ ఉండటంతో ఆలుమగల మధ్య గొడవలు జరిగేవి. ఓ రోజు అతడు ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. మరి కొద్ది రోజుల్లో కర్వా చౌత్ ఉందనంగా జరిగిందీ ఘటన. వెంటనే ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసింది. భర్త కోసం కర్వా చౌత్ వత్రం పట్టనని స్పష్టం చేసింది. దీంతో.. ప్రియుడికి ఆమె అంతరార్థం అర్థమైంది.


ఆ తరువాత.. వారిద్దరూ కలిసి పరీక్షిత్‌ను హత్య చేసేందుకు పథకం రచించారు. హత్యకు ఏడు రోజుల మునేపే ఆమె తను ఎప్పుడూ వాడే సిమ్ కార్డులను పక్కకు పెట్టి కొత్త సిమ్ వినియోగించడం ప్రారంభించింది. విషయం ఎవరికీ తెలియకూడదని ఆమె ఈ ప్లాన్ వేసింది. ప్రియుడితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండేది. వారు ముందుగా అనుకున్న పథకం గత నెలలో ఆమె ప్రియుడు తన స్నేహితుడితో కలిసి పరీక్షిత్ గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని కాలవలో పడేశాడు. కాగా.. ఒక్కో క్లూను జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకెళ్లిన పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు.

Updated Date - 2021-10-28T01:13:26+05:30 IST