షాకింగ్: వివాహితపై సామూహిక అత్యాచారం! సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్!
ABN , First Publish Date - 2020-09-19T21:24:02+05:30 IST
రాజస్థాన్కు చెందిన ఓ మహిళపై ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. నిందితులు ఈ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. రాజస్థాన్కు చెందిన ఆల్వార్ జిల్లాలో గురువారం నాడు ఈ దారుణం జరిగింది.
ఆల్వార్: రాజస్థాన్కు చెందిన ఓ మహిళపై ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. నిందితులు ఈ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. రాజస్థాన్కు చెందిన ఆల్వార్ జిల్లాలో గురువారం నాడు ఈ దారుణం జరిగింది.
‘వివాహిత తన బంధువుతో కలసి గురువారం నాడు ఓ వ్యక్తికి అప్పిచ్చి తిరిగి వస్తుండగా ఆరుగురు దుండగులు ఆమెను అడ్డగించారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెతో పాటూ ఉన్న బంధువుపై దాడికి దిగారు. ఆ తరువాత వారు ఆమెను బలాత్కరించి, ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు’ అని తిజారా డీఎస్పీ కుషాల్ సింగ్ మీడియాకు తెలిపారు.
జరిగిన ఉదంతాన్ని ఆమె తన భర్తకు చెప్పి అతడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. ఆరుగురు నిందితులలో, ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మిగతా వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.