భర్త పైశాచికత్వం! కట్టుకున్న భార్యను కసితీరా.. మరో నలుగురితో కలసి..

ABN , First Publish Date - 2020-06-06T18:29:54+05:30 IST

ట్టుకున్న భర్తే తనను కాటేశాడని, మరో నలుగురు వ్యక్తులతో కలసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తిరువనంతంపురానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త పైశాచికత్వం! కట్టుకున్న భార్యను కసితీరా.. మరో నలుగురితో కలసి..

తిరువనంతపురం: కట్టుకున్న భర్తే తనను కాటేశాడని, మరో నలుగురు వ్యక్తులతో కలసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తిరువనంతంపురానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసులకు ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలని ఆమె భర్త స్థానికంగా ఉన్న బీచ్‌కు తీసుకెళ్లాడు. తమ ఐదేళ్ల కుమారుడిని కూడా వెంట తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక భర్త ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తరువాత ఆమెను సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న మరో నలుగురు వ్యక్తులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమ కుమారుడి ముందే భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడు. 


బాధితురాలు ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన సమయంలో ఐదుగురు కలసి ఆమెను కొట్టారు. కసితీరా సిగరెట్లతో గాయాలు చేశారు. అయితే.. ఏడుస్తున్న పిల్లాడిని ఇంట్లో దిగబెట్టి మళ్లివస్తానని బాధితురాలు వేడుకోవడంతో వారు ఆమెను విడిచిపెట్టారు. ఆ తరువాత రోడ్డుపైకి వచ్చిన ఆమె..అటుగా వెళుతున్న వాహనంలో లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి బయటపడ్డారు.


ఈ సందర్భంగా ఆమె కారులోని వ్యక్తులతో జరిగిన దారుణం గురించి చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ దారుణంలో భర్త కూడా పాలుపంచుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తిరువనంతపురం రూరల్ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుల్లో కొందరికి నేర చిరిత్ర కూడా ఉందన్నారు.  

Updated Date - 2020-06-06T18:29:54+05:30 IST