పెళ్లైన ఏడాదికే భర్త వికృతరూపం వెలుగులోకి.. కట్నం కోసం భార్యను ఎంతలా హింసించాడంటే..

ABN , First Publish Date - 2022-02-09T21:54:01+05:30 IST

ఆమెకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఏడాది వరకు కాపురం సాఫీగా సాగిపోయింది..

పెళ్లైన ఏడాదికే భర్త వికృతరూపం వెలుగులోకి.. కట్నం కోసం భార్యను ఎంతలా హింసించాడంటే..

ఆమెకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఏడాది వరకు కాపురం సాఫీగా సాగిపోయింది.. ఆ తర్వాతే అత్తింటి వారి అసలు స్వరూపం, భర్త క‌‌‌ౄరత్వం ఆమెకు తెలిసింది.. కట్నం కోసం భర్త, అత్త మామలు పెట్టే వేధింపులను ఆమె రెండేళ్లు భరించగలిగింది.. అయినా వారి తీరులో మార్పు రాకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్‌లోని విదిశ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


కొత్వాలి పరిధిలోని అరిహంత్ విహార్ ఫేజ్-1లో నివసిస్తున్న పూజ అనే మహిళ 2019 మే 2న సూరజ్ జైన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన ఏడాది వరకు ఆమె సంతోషంగానే గడిపింది. మొదటి వివాహ వార్షికోత్సవం తర్వాత భర్త అసలు రంగు బయటపడింది. తనకు రూ.10 లక్షలు అదనపు కట్నం కావాలని భర్త వేధించడం ప్రారంభించాడు. అదనపు కట్నం కోసం తరచుగా భార్యను కొట్టేవాడు. పుట్టింటికి పంపేవాడు. తిరిగి వచ్చాక మళ్లీ టార్చర్ పెట్టేవాడు. 


కట్నం తీసుకు రాలేదనే కోపంతో 2021, జనవరి 19న పూజ ఇష్టానికి విరుద్ధంగా సూరజ్ అబార్షన్ చేయించాడు. అబార్షన్ జరిగిన తర్వాత ఆమె కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. భర్తతో పాటు అత్త మామలు కూడా పూజను కొట్టేవారు. ఆమె కాలు, తొడపై వాతలు పెట్టారు. వారి వేధింపులు భరించలేక పూజ మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-02-09T21:54:01+05:30 IST