భర్తతో సహా ఇంట్లో అందరికీ మత్తు మందు పెట్టి.. పక్కింటి కుర్రాడితో పారిపోయిన యువతి!

ABN , First Publish Date - 2022-06-09T09:56:35+05:30 IST

ఆ ఇంట్లో నుంచి రోజూ ఉదయాన్నే బయటకు వచ్చి జనాలతో మాట్లాడే 75 సంవత్సరాల వృద్ధురాలు బయటకు రాలేదు. ఆమె ముగ్గురు బిడ్డల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఏమైందా? అని ఇంట్లోకి వెళ్లిన ఇరుగుపొరుగు వారికి ఆ తల్లితోపాటు ముగ్గురు కొడుకులూ స్పృహలేని స్థితిలో కనిపించారు...

భర్తతో సహా ఇంట్లో అందరికీ మత్తు మందు పెట్టి.. పక్కింటి కుర్రాడితో పారిపోయిన యువతి!

ఆ ఇంట్లో నుంచి రోజూ ఉదయాన్నే బయటకు వచ్చి జనాలతో మాట్లాడే 75 సంవత్సరాల వృద్ధురాలు బయటకు రాలేదు. ఆమె ముగ్గురు బిడ్డల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఏమైందా? అని ఇంట్లోకి వెళ్లిన ఇరుగుపొరుగు వారికి ఆ తల్లితోపాటు ముగ్గురు కొడుకులూ స్పృహలేని స్థితిలో కనిపించారు. అది చూసి షాకైన వాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని జునేద్‌పూర్ గ్రామంలో జరిగింది.


ఆ కుటుంబ సభ్యులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షల్లో ఆ నలుగురు కుటుంబ సభ్యుల రక్తంలో మత్తుమందు దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్‌కు గురయ్యారు. పోలీసులు విచారణ కోసం వారిని ప్రశ్నించగా.. వృద్ధురాలి పెద్ద కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగిందని.. ఇప్పుడా కొత్త కోడలు కనబడడం లేదని తేలింది. కోడలు అంతకుముందు రోజు వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులంతా తిన్నారు. అంతే ఆ తర్వాత ఏమైందో తెలియదని చెప్పారు. 


పోలీసులు ఆరా తీయగా.. సదరు ఇల్లాలు చేసిన దారుణం బయటపడింది. కుటుంబంలో అందరికీ మత్తుమంది పెట్టిన ఆమె.. పక్కింట్లో ఉండే ప్రియుడితో కలిసి పరారైంది. కొంతకాలంగా వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తేలింది. ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు ఇల్లాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2022-06-09T09:56:35+05:30 IST