అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN , First Publish Date - 2022-01-20T04:44:15+05:30 IST
మండలంలోని దొబ్బుడుపల్లె-తిరుమలాయపల్లె రోడ్డు మార్గంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది.
కొండాపురం, జనవరి 19: మండలంలోని దొబ్బుడుపల్లె-తిరుమలాయపల్లె రోడ్డు మార్గంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈమె వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. పచ్చచీర ధరించి గాయాలతో రోడ్డుపక్కన మృతదేహం పడి ఉంది. ఈమె ఆచూకీ వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని తాళ్లప్రొద్దుటూరు ఇన్చార్జి ఎస్ఐ మద్దిలేటి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.