అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-03-17T21:40:14+05:30 IST
అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన
కృష్ణా: అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని బాపులపాడు మండలంలో జరిగింది. మండలంలోని కె.సీతారాంపురం గ్రామానికి చెందిన ఆవుల కృష్ణవేణి(30) అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. రెండు రోజుల కిందట ప్రియుడితో కలిసి హనుమాన్ జంక్షన్లోని ఓ లాడ్జికి మృతురాలు వెళ్లింది. లాడ్జి నుంచి ఇంటికి వెళ్ళిన కృష్ణవేణి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ఈ రోజు ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణవేణి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపారు.