విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-21T04:57:01+05:30 IST

మండల కేంద్రానికి చెందిన తుమ్మిడి కళావతి(35) అనే మహిళ బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. హెడ్‌కాని స్టేబుల్‌ రాజమౌళి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కళావతి బుధవారం ఉదయం పశువులకు మేత తీసుకురావడానికి వెళ్లింది.

విద్యుదాఘాతంతో మహిళ మృతి
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు

దహెగాం, అక్టోబరు 20: మండల కేంద్రానికి చెందిన తుమ్మిడి కళావతి(35) అనే మహిళ బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. హెడ్‌కాని స్టేబుల్‌ రాజమౌళి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కళావతి బుధవారం ఉదయం పశువులకు మేత తీసుకురావడానికి వెళ్లింది. వరిపొలం గట్లపై ఉన్న గడ్డిని కోస్తున్న క్రమంలో విద్యుత్‌ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కళావతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కూతరురు అంజలి వెళ్లి చూసే సరికి విగితజీవిగా పడి ఉండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారంతా వెళ్లి కళావతిని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉంది. భర్త నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీనాయకుడు పాల్వాయి హరీష్‌బాబు మృతిరాలి కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - 2021-10-21T04:57:01+05:30 IST