మెట్రో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-11T20:33:37+05:30 IST

మెట్రో రైలు వస్తుండగా దాని ముందుకు దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన..

మెట్రో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

కోల్‌కతా: మెట్రో రైలు వస్తుండగా దాని ముందుకు దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమైంది. నార్త్ కోల్‌కతాలోని గిరీష్ పార్క్ స్టేషన్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీంతో నార్త్-సౌత్ లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మధ్నాహ్నం 12.35 గంటలకు ఈ ఘటన జరిగిందని, కబి సుభాస్-బౌండ్ రైలు వస్తుండగా రైలు ముందుకు ఆమె జంప్ చేసి  ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఆమె ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉందని అన్నారు. దీనిపై విచారణ చేపట్టామని, సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.



Updated Date - 2022-07-11T20:33:37+05:30 IST