బావిలో పడి మహిళ మృతి
ABN , First Publish Date - 2022-05-29T05:18:27+05:30 IST
బావిలో పడి మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రామాంజనే యుడు తెలిపారు.
చిన్నమండెం, మే28: బావిలో పడి మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రామాంజనే యుడు తెలిపారు. చెరువుకిందపల్లె వాసి తోట రాంమోహన్ రెండో భార్య తోట అ చ్చమ్మ (45) పశువు ల మేత కోసం వెళ్లి పొలంలోని బావిలో ప్రమాదవశాత్తుపడి మృతి చెందింది. శుక్రవా రం మధ్యాహ్నం అచ్చమ్మ పశువుల మేత కోసం వెళ్లింది. సాయం త్రమైనా ఆమె ఇంటికి రాకపోవడంతో వెదికారు. చివరకు కుటుంబ సభ్యులకు బావి దగ్గర చెప్పులు, టవల్ కనిపించడంతో బావిలో వెదికారు. చీకటి పడడంతో వెనుదిరిగారు. శనివారం ఉదయం బావి లో శవం తేలింది. దీంతో చనిపోయినట్లు గుర్తించి భర్త ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. అచ్చమ్మ మృతితో బలిజపల్లెలో విషాధచాయలు అలుముకున్నాయి.
బావిలో యువకుడి మృతదేహం....
వల్లూరు, మే 28: అన్నవరం సమీప బావిలో స్థానికులు యువకుడి మృత దేహం గుర్తించారు. విషయం తెలుసుకు న్న వల్లూరు ఎస్ఐ విష్ణువర్ధన్ స్థానికుల ను విచారించారు. అంబవరం వాసి ఆంజనేయులు(25) కొద్ది రోజులుగా కనిపించడం లేదని కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో గాలిస్తున్న సిబ్బంది బావిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. దీంతో మృతదేహం ఆంజనేయులుదిగా గుర్తించారు. కడప రూరల్ సీఐ శ్రీరామ్ శ్రీనివా సులు మాట్లాడుతూ అనుమానాస్పదంగా ఉందని, శరీరంపై కొట్టిన గాయాలున్నాయని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.