రిజర్వాయరులో పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-18T05:08:57+05:30 IST

పెద్దగెడ్డ జలాశయంలో పడి ఓ మహిళ మృతి చెందింది.

రిజర్వాయరులో పడి మహిళ మృతి

పాచిపెంట, అక్టోబరు 17: పెద్దగెడ్డ జలాశయంలో పడి ఓ మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. కుమ్మరివలస గ్రామానికి చెందిన దీసరి సింహా చలం(30) అనే మహిళ ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. ఈమెకు గత కొద్ది రోజులు గా ఆరోగ్యం బాగోలేదు. దీంతో వైద్యం కోసమని మండల కేంద్రం సమీపంలో ఉన్న యర్రడ్లవలసలోని తన బంధువుల ఇంటికి శనివారం సాయంత్రం వెళ్లింది. అక్కడ మతిస్థిమితం లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడిందని బంధువులు చెప్పారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం పెద్దగెడ్డ రిజర్వాయర్‌లో శవమై తేలియాడింది. అటుగా వెళ్లిన వారు చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి పెద్దగెడ్డలో పడిపోయి ఉంటుందని మృతురాలి తల్లి తిరపతమ్మ తెలిపారు. 


Updated Date - 2021-10-18T05:08:57+05:30 IST