కల్తీకల్లు తాగి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-07-03T05:25:15+05:30 IST

కల్తీకల్లు తాగి మహిళ మృతి

కల్తీకల్లు తాగి మహిళ మృతి

షాబాద్‌, జూలై 2: కల్తీ కల్లు తాగి ఓ మహిళ మృతిచెందగా మరో ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేసారంలో కల్లు తాగిన అదే గ్రామానికి చెందిన తొంట కిష్టమ్మ(50) అనే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందింది. అదే విధంగా గ్రామానికి చెందిన కిష్టమ్మ, పద్మమ్మ అనే ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో వారిని నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని కల్లు దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణాన్ని సీజ్‌చేసి కల్లు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Updated Date - 2022-07-03T05:25:15+05:30 IST