బైక్ను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి
ABN , First Publish Date - 2020-08-13T20:30:26+05:30 IST
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గేట్ దగ్గర బైక్ను లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో బైకు పైన ప్రయాణించే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గేట్ దగ్గర బైక్ను లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో బైకు పైన ప్రయాణించే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. కూర్మల్ గుడాకు చెందిన బాబు దంపతులు బైక్పై కూర్మల్గూడ నుంచి మహేశ్వరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.