బీజేపీ కార్పొరేటర్కు సమన్లు జారీ చేసిన పోలీసులు
ABN , First Publish Date - 2021-03-07T23:33:55+05:30 IST
బీజేపీ కార్పొరేటర్కు సమన్లు జారీ చేసిన పోలీసులు
పుణె: బీజేపీ కార్పొరేటర్కు స్థానిక పోలీసులు సమన్లు జారీ చేశారు. పుణెలో 23 ఏళ్ల మహిళ మృతికి సంబంధించి స్థానిక బీజీపీ కార్పొరేటర్ను పోలీసులు పిలిపించారని ఒక అధికారి తెలిపారు. ఫిబ్రవరి 8న హదప్సర్లో చనిపోయిన మహిళ కేసు అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల దాడి మొదలైంది.
వనావాడి కార్పొరేటర్ ధన్రాజ్ ఘోగారేను పిలిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులోని మొత్తం వాస్తవాలపై ఆయనను ప్రశ్నించనున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఇదిలావుండగా మరణించినవారికి సహాయం చేశానని పేర్కొన్న ఘోగారే లాంటి వ్యక్తిని ప్రశ్నించడం సమంజసం కాదని పుణె బీజేపీ తెలిపింది.