విజయవాడ: మిస్టరీగా మారిన మహిళ మృతి కేసు

ABN , First Publish Date - 2022-01-18T20:33:59+05:30 IST

విజయవాడ: ఓ మహిళ మృతి కేసు మిస్టరీగా మారింది.

విజయవాడ: మిస్టరీగా మారిన మహిళ మృతి కేసు

విజయవాడ: ఓ మహిళ మృతి కేసు మిస్టరీగా మారింది. సోమవారం శిఖామణి సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తనూజ అనే మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతురాలు గుంటూరు ఏటీ అగ్రహారం చెందినదిగా గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పని చేస్తున్న తనూజ 16వ తేదీ సాయంత్రం గుంటూరులోని తన ఇంటి నుంచి వాకింగ్ కోసమని వచ్చింది. చివరికి విజయవాడలో శవమై కనిపించింది. అయితే గుంటూరులో ఇంటి నుంచి వచ్చిన తనూజ విజయవాడ ఎందుకు వచ్చింది? ఆమెను ఎవరైనా గుంటూరులో హత్య చేసి.. విజయవాడలో పడేశారా? లేక విజయవాడ తీసుకువచ్చి చంపేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కుటుంబ కలహాలా.. లేక అత్యాచారం చేసి హత్య చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-18T20:33:59+05:30 IST