పాముకాటుతో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-18T06:12:09+05:30 IST

పాముకాటుతో మహిళ మృతి

పాముకాటుతో మహిళ మృతి

కాటారం, అక్టోబరు 17: పాముకాటుతో మహిళ మృతి చెంది సంఘటన మండలలోని శంకరంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపి వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన ఐలాపురం శ్రీలత(37) వ్యవసాయ పనుల నిమిత్తం పత్తి చేనులోకి వెళ్లింది. నడుచుకుంటూ తిరిగికి ఇంటికి వస్తున్న క్రమంలో పాముకాటుకు గురైంది. ఇంటికి వచ్చాక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో 108  అంబులెన్స్‌లో ఆమెను మహదేవపూర్‌ సా మాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీలత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. వ్యవసాయ కూలీ అయినా శ్రీలత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని సర్పంచ్‌ అశోక్‌, గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-18T06:12:09+05:30 IST