Jamshedpur triple murder: మూసి ఉన్న ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన.. స్థానికుల ఫిర్యాదుతో తలుపులు తెరిచి చూడగా..
ABN , First Publish Date - 2022-07-23T00:15:07+05:30 IST
ఆ మహిళ ఎస్పీ ఆఫీస్లో కానిస్టేబుల్.. జంషెడ్పూర్లోని గోల్మురి ప్రాంతంలో తన తల్లి, కూతురితో కలిసి నివసిస్తోంది..
ఆ మహిళ ఎస్పీ ఆఫీస్లో కానిస్టేబుల్.. జంషెడ్పూర్లోని గోల్మురి ప్రాంతంలో తన తల్లి, కూతురితో కలిసి నివసిస్తోంది.. గత రెండ్రోజులుగా ఆమె ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు.. బయటి నుంచి తాళం వేసి ఉంది.. ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి చూడగా లోపల ముగ్గురూ విగత జీవులై పడి ఉన్నారు. ఝార్ఖండ్ (Jharkhand)లోని జంషెడ్పూర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
ఇంటి ముందు ఉన్న స్తంభానికి భార్యను కట్టేసి చితకబాదిన భర్త.. అతడు ఇంత దారుణానికి ఒడిగట్టడం వెనుక..
జంషెడ్పూర్ ఎస్పీ ఆఫీస్లో సవిత అనే మహిళ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తోంది. గోల్మురి ప్రాంతంలో తన తల్లి, కూతురితో కలిసి నివసిస్తోంది. సవిత, ఆమె తల్లి, కూతురు రెండ్రోజల క్రితం చనిపోయారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించారు. బయటి నుంచి తాళం వేసి ఉండడంతో ఆ ముగ్గురినీ ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.