వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. ఆస్తి కోసం ఎంతటి దారుణానికి తెగించిందంటే..

ABN , First Publish Date - 2022-03-16T05:37:03+05:30 IST

భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది.. పోషణ కోసం ఒక వ్యాపారవేత్త ఇంట్లో పని చేసుకుంటోంది. కొన్ని నెలల క్రితం ఆమెకు ఆ వ్యాపారవేత్తతో శారీరక సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు...

వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. ఆస్తి కోసం ఎంతటి దారుణానికి తెగించిందంటే..

భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది.. పోషణ కోసం ఒక వ్యాపారవేత్త ఇంట్లో పని చేసుకుంటోంది. కొన్ని నెలల క్రితం ఆమెకు ఆ వ్యాపారవేత్తతో శారీరక సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. ఆ వ్యాపారవేత్తకు పిల్లలు లేకపోవడంతో అతని ఆస్తిపై ఆమె కన్నుపడింది. ఆ ఆస్తి కాజేయడానికి ఆమె దారుణానికి ఒడిగట్టింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌కు చెందిన రాజేష్ అగర్వాల్‌ అనే వ్యాపారవేత్త, అతని భార్య బబిత గత నెల 28న హఠాత్తుగా అదృశ్యమయ్యారు. బబిత సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజుల విచారణ అనంతరం రాజేష్, ఆయన ఇంట్లో పని చేసే రోమా దేవి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. 


విచారణలో రోమా దేవి అసలు విషయం బయటపెట్టింది. తనను రాజేష్ అగర్వాల్‌ వద్ద నుంచి డబ్బు కాజేయాలని రోమాదేవి ప్లాన్ వేసింది. రోమా దేవి కుమారుడు, అతని నలుగురు స్నేహితులు గత నెల 27న రాజేష్ ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్లారు. కానీ అక్కడ వారిని రాజేష్, అతని భార్య ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో రోమాదేవి కుమారుడు. అతని స్నేహితులు అగర్వాల్ దంపతులను హత్య చేశారు. అనంతరం మృతదేహాలను మాయం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-03-16T05:37:03+05:30 IST