పెళ్లి జరిగిన నెల రోజులకే ఘోరం.. మామ లైంగికంగా వేధించడంతో ఫిర్యాదు.. దాంతో భర్త ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-03-08T05:44:12+05:30 IST

ఆమెకు నెల రోజుల కిందట వివాహమైంది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన ఆమెకు మామగారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఉన్నతోద్యోగి అయిన మామగారు కోడలిపై...

పెళ్లి జరిగిన నెల రోజులకే ఘోరం.. మామ లైంగికంగా వేధించడంతో ఫిర్యాదు.. దాంతో భర్త ఏం చేశాడంటే..

ఆమెకు నెల రోజుల కిందట వివాహమైంది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టిన ఆమెకు మామగారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఉన్నతోద్యోగి అయిన మామగారు కోడలిపై అకృత్యానికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతి ఆ విషయాన్ని భర్తకు, అత్తకు చెప్పింది. వారు ఆ విషయాన్ని దాచడానికి ప్రయత్నించారు. అయినా ఆ మహిళ మాట వినకపోవడంతో భర్త ఆమెను కాల్చి చంపాడు. 


హర్యానాలోని పాల్వాల్ జిల్లా త్వాడా కాలనీకి చెందిన దుంగార్ సింగ్ నెల రోజుల క్రితం రజినీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే అత్తింట అడుగు పెట్టిన రజినీకి మామగారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దుంగార్ సింగ్ తండ్రి కర్తార్ సింగ్ వీలు కుదిరినప్పుడల్లా రజినీని లైంగికంగా వేధించేవాడు. ఆ విషయాన్ని రజినీ తన భర్తకు, అత్తగారికి చెప్పింది. వారు ఆ పెద్దమనిషికి ఎదురునిలబడక.. రజినీపై కోపం చూపించారు. ఇంటి విషయం బయటకు రాకూడదంటూ బెదిరించారు.


రోజురోజుకూ మామగారి వేధింపులు పెరగడంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుంగార్ సింగ్ ఆదివారం రాత్రి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అదే తుపాకీతో తనను గాయపరచుకున్నాడు. ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా, రజినీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామగారి వేధింపుల గురించి బయటపెట్టిందనే కారణంతోనే రజినీని చంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-03-08T05:44:12+05:30 IST