హైదరాబాద్లో దారుణం.. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-18T22:41:43+05:30 IST
హైదరాబాద్లో దారుణం.. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: భాగ్యనగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. చందానగర్లోని ఓ భవనంపై నుంచి దూకి శ్రీవిద్య (27) ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. భర్త శబరీష్ వేధింపులే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవిద్య నిన్న భర్త శబరీష్తో గొడవపడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ సంఘటనపై చందానగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. 6 నెలల క్రితం వరంగల్కు చెందిన శబరీష్తో కరీంనగర్కు చెందిన శ్రీవిద్య వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.