ప్రియుడితో ఇంట్లోనే దొరికిపోవడంతో భర్తకు ఆగ్రహం.. కొద్ది నిమిషాల్లోనే భార్య తీసుకున్న నిర్ణయంతో అతడికి మైండ్‌బ్లాంక్..!

ABN , First Publish Date - 2022-06-26T02:46:38+05:30 IST

ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నివసిస్తోంది.. ఆమె భర్త తాపీ మేస్త్రిగా పని చేస్తాడు

ప్రియుడితో ఇంట్లోనే దొరికిపోవడంతో భర్తకు ఆగ్రహం.. కొద్ది నిమిషాల్లోనే భార్య తీసుకున్న నిర్ణయంతో అతడికి మైండ్‌బ్లాంక్..!

ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నివసిస్తోంది.. ఆమె భర్త తాపీ మేస్త్రిగా పని చేస్తాడు.. గత మంగళవారం భర్త తాపీ పనిలోకి, పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారు.. మధ్యాహ్నం 12 గంటలకు భర్త భోజనం కోసం ఇంటికి తిరిగి వెళ్లాడు.. ఆ సమయంలో ఆ మహిళ పక్కింటి యువకుడితో శృంగారం సాగిస్తూ భర్తకు దొరికిపోయింది.. వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.. దీంతో భార్యను భర్త కొట్టాడు.. ఆమె వెంటనే బాత్రూమ్‌లోకి వెళ్లి యాసిడ్ తాగేసింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 


ఇది కూడా చదవండి..

పెళ్లయిన ఏడో రోజే ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను పట్టుకున్న పోలీసులు.. ఇదేంటని భర్త నిలదీస్తే ఆమె రెస్పాన్స్ ఇదీ..


ఝాన్సీలోని దదియాపురలో 35 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి నివాసం ఉండేది. ఆమె భర్త తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. గత మంగళవారం ఉదయం భర్త తాపీ పనిలోకి, పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భోజనం చేసేందుకు భర్త ఇంటికి వెళ్లాడు. తలుపు తీసి చూడగా లోపల అతడి భార్య పక్కింటి యువకుడితో ఉంది. ఆ యువకుడు వెంటనే అక్కణ్నుంచి పారిపోయాడు. భర్త చేతిలో దెబ్బలు తిన్న ఆ మహిళ బాత్రూమ్‌లోకి వెళ్లి యాసిడ్ తాగేసింది. పరిస్థితి విషమించడంతో భార్యను భర్త హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.


మూడ్రోజుల చికిత్స అనంతరం శుక్రవారం ఆ మహిళ చనిపోయింది. అయితే పోలీసులకు, భార్య తరఫు వారికి సమాచారం ఇవ్వకుండానే ఆమె అంత్యక్రియలు చేసేందుకు భర్త సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-06-26T02:46:38+05:30 IST