పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-18T05:52:59+05:30 IST
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
పాపన్నపేట, మే 17: పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏడుపాయల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కండ్లకోయ్య గ్రామానికి చెందిన తూర్పాటి దుర్గమ్మ (30) భర్త సత్యనారాయణతో కలిసి కూలీ పనులు చేసుకుంటుంది. ఇంట్లో చెప్పి తన అమ్మవారి ఊరైన మంబోజీపల్లికి శుక్రవారం వచ్చింది. సోమవారం ఏడుపాయలకు వెళ్తుతున్నానని చెప్పి వచ్చింది. ఈ క్రమంలో ఏడుపాయలలోని ఆలయ సమీపంలో నదీ పాయ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించి. పంచనామా నిర్వహించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.