కరోనా భయంతో మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-08T08:39:37+05:30 IST
విశాఖ నగరంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంది
మల్కాపురం (విశాఖ సిటీ), ఆగస్టు 7: విశాఖ నగరంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. 53ఏళ్ల వితంతు మహిళ, ఆమె కుమారుడు(అవివాహితుడు)తో కలిసి నివసిస్తోంది. మూడు రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో మెడికల్ షాపులో మందులు తెచ్చుకుని వాడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో కరోనా సోకిందేమోనని భయపడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున వంటగదిలో చీరతో ఉరేసుకుంది.