బంధువుల ఇంట్లో పెళ్లికి భర్త రానన్నాడు.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-11-16T16:50:48+05:30 IST

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన..

బంధువుల ఇంట్లో పెళ్లికి భర్త రానన్నాడు.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె ఏం చేసిందంటే..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఒక మహిళ తన భర్తపై ప్రతాపం చూపి, చివరికి పోలీసు కేసులో ఇరుక్కుంది. బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి రానన్న భర్తపై దాడి చేసింది. ఈ నేపధ్యంలో భర్త ఫిర్యాదు మేరకు ముకుంద్‌వాడీ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదయ్యింది. భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి హాజరుకావడంపై భార్యాభర్తల మధ్య చర్చ జరిగింది. ఈ సమయంలో భర్త తాను పెళ్లికి రాలేనని, ఆమెను వెళ్లాలని కోరాడు. ఈ చర్చ.. వారు సాయంత్రం వేళ టీ తాగుతున్న సమయంలో జరిగింది. బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి రానని భర్త చెప్పడంతో ఆమె ఆగ్రహించి, తన చేతిలోని వేడి టీ కప్పును భర్త మీదకు విసిరేసింది. అది అతని తలకు గట్టిగా తగిలింది. తరువాత ఆమె వంటగదిలో వినియోగించే చాకుతో భర్తపై దాడి చేసింది. ఈ నేపధ్యంలో భర్త తనపై దాడిచేసిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2021-11-16T16:50:48+05:30 IST