మే 14న పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతి.. రాళ్ల కుప్పకింద గుర్తు తెలియని శవంలా.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-06T17:43:25+05:30 IST

ఆ యువతికి పెళ్లి ఫిక్స్ అయింది.. ఈ నెల 14వ తేదీన వివాహానికి ముహూర్తం కుదిరింది..

మే 14న పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువతి.. రాళ్ల కుప్పకింద గుర్తు తెలియని శవంలా.. అసలేం జరిగిందంటే..

ఆ యువతికి పెళ్లి ఫిక్స్ అయింది.. ఈ నెల 14వ తేదీన వివాహానికి ముహూర్తం కుదిరింది.. ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి.. ఆ సమయంలో ఆ యువతి అదృశ్యమైంది.. తర్వాతి రోజు రాళ్ల కుప్ప కింద శవంలా తేలింది.. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.. విషయం తెలుసుకుని వరుడి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఉదయపూర్ జిల్లాలోని సెమరి చెరువు ఎగువ భాగంలో పొలం పక్కన రాళ్ల కింద పూడ్చిపెట్టిన బాలిక మృతదేహం గురువారం ఉదయం గొర్రెల కాపరుల కంట పడింది. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయాలు కావడంతో ఆ మృతదేహాన్ని గుర్తించడం చాలా కష్టమైంది. దీంతో మృతురాలి ఫోటోను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోను యువతి మేనమామ గుర్తించారు. పోలీసులకు వివరాలు చెప్పారు. 


మేనమామ ఇచ్చిన సమాచారం ప్రకారం మృతురాలికి ఈ నెల 14వ తేదీని పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. విషయం తెలుసుకుని వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హత్యపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఈ కేసులో ముందుకెళ్లనున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more