రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోంచి అరుపులు.. భార్య చేసిన పని చూసి స్థానికులు షాక్.. ఆ తర్వాత భర్తను వెంటనే..

ABN , First Publish Date - 2022-07-15T14:55:06+05:30 IST

రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ప్రాంతంలో అందరూ నిద్రకు ఉపక్రమించారు. సరిగ్గా రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లోంచి అరుపులు రావడాన్ని గమనించి.. స్థానికులు తొలుత లైట్ తీసుకున్నారు. ఎంతకూ ఆ అరుపులు తగ్గకపోవడం.. మరింత పెద్దగా శబ్దాలు

రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోంచి అరుపులు.. భార్య చేసిన పని చూసి స్థానికులు షాక్.. ఆ తర్వాత భర్తను వెంటనే..

ఇంటర్నెట్ డెస్క్: రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ప్రాంతంలో అందరూ నిద్రకు ఉపక్రమించారు. సరిగ్గా రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లోంచి అరుపులు రావడాన్ని గమనించి.. స్థానికులు తొలుత లైట్ తీసుకున్నారు. ఎంతకూ ఆ అరుపులు తగ్గకపోవడం.. మరింత పెద్దగా శబ్దాలు రావడంతో కంగారు పడ్డారు. వెంటనే ఆ ఇంట్లోకి పరుగులు తీశారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. భార్య చేసిన పనికి అవాక్కైన స్థానికులు.. భర్తను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా.. స్థానికంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



రాజస్థాన్‌‌కు చెందిన అమిన్, అనీషా‌కు కొనాళ్ల క్రితం వివాహం జరిగింది. బీకనీర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివసిస్తూ ఆ భార్యభర్తలు కాపురం చేస్తున్నారు. తాజాగా భార్యభర్తల మధ్య ఓ విషయంలో మనస్పర్థలు వచ్చాయి. విబేధాలు ఆ తర్వాత గొడవకు దారి తీశాయి.  దీంతో అర్ధరాత్రి 11 గంటలకు అనీషా రెచ్చిపోయింది. క్రికెట్ బ్యాట్‌తో అమిన్‌పై దాడికి దిగింది. తలపై బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయమైంది. అమిన్, అనీషా ఇంట్లోంచి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో తొలుత తేలిగ్గా తీసుకున్న స్థానికులు ఆ తర్వాత వాళ్లింటికి పరుగులు తీశారు. అనంతరం అనీషా చేసిన పని చూసి షాకయ్యారు. వెంటనే రక్తం మడుగులో పడి ఉన్న ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడి తలకు 17 కుట్లు వేసి చికిత్స అందించారు. కాగా.. విషయం అమిన్ తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు అనీషాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు జరుపుతున్నారు. 


Updated Date - 2022-07-15T14:55:06+05:30 IST