ఒంటరిగా వెళుతున్నయువతి.. వారికి ఉండబట్టలేక పొదల్లోకి లాగబోయారు.. సీన్ రివర్స్ కావడంతో కళ్లు బైర్లు కమ్మాయి.. ఇంతకీ ఏం జరిగింది?

ABN , First Publish Date - 2021-10-13T13:04:02+05:30 IST

అమ్మాయిలపై పోకిరీల అశ్లీల చేష్టలకు అడ్డుకట్టలేకుండా పోతోంది.

ఒంటరిగా వెళుతున్నయువతి.. వారికి ఉండబట్టలేక పొదల్లోకి లాగబోయారు.. సీన్ రివర్స్ కావడంతో కళ్లు బైర్లు కమ్మాయి.. ఇంతకీ ఏం జరిగింది?

అమ్మాయిలపై పోకిరీల అశ్లీల చేష్టలకు అడ్డుకట్టలేకుండా పోతోంది. దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్‌లోని ముజఫ్ఫర్ నగర్‌లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఆ పోకిరీలకు అక్కడున్న మహిళలు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శివాయీ పట్టీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువతిని అల్లరిపాలు చేయాలనుకున్న యువకులకు దిమ్మతిరిగిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన ఒక యువతి కొద్దిరోజులుగా ఒంటరిగా ట్యూషన్ సెంటర్‌కు వెళ్లివస్తోంది. 


ఆమెను గమనించిన ఇద్దరు యువకులు దారిలో ఆమెను ఆపి, అశ్లీలంగా మాట్లాడుతూ, అత్యాచారం చేసేందుకు పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ, గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. భారీగా జనం తమవైపు వస్తుండటాన్ని చూసిన ఆ ఇద్దరు యువకులకు కళ్లు బైర్లు కమ్మాయి. పరిగెత్తే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే వారు అక్కడికి వచ్చిన జనానికి దొరికిపోయారు.. అంతే.. ఆ ఇద్దరు యువకులను పట్టుకున్న జనం అక్కడే ఉన్న విద్యుత్ స్థంభానికి కట్టేసి పిడిగుద్దులు కురిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-13T13:04:02+05:30 IST