సినిమాను తలపించేలా నిజజీవిత ప్రేమకథ.. పేదింటి అబ్బాయి గొప్పింటి అమ్మాయి.. వారిద్దరూ లేచిపోగా.. యువకుడి తల్లిని ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-02-01T06:48:46+05:30 IST

ఆ యువకుడు ఒక పేదింటికి చెందిన వాడు. స్థానికంగా ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. అతడు తన పక్కింట్లో ఉండే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు...

సినిమాను తలపించేలా నిజజీవిత ప్రేమకథ.. పేదింటి అబ్బాయి గొప్పింటి అమ్మాయి.. వారిద్దరూ లేచిపోగా.. యువకుడి తల్లిని ఏం చేశారంటే..

ఆ యువకుడు ఒక పేదింటికి చెందిన వాడు. స్థానికంగా ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. అతడు తన పక్కింట్లో ఉండే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి ప్రేమకు ఆస్తి, అంతస్తులు అడ్డుగోడగా మారాయి. దీంతో వారిద్దరూ ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. ఆ తరువాత అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని సినిమాను తలపించేలా ఘోరంగా శిక్షించారు.


వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుధు నగర్ జిల్లాలో నివసించే ఒక పేద యువకుడు తన పక్కింట్లో నివసించే యువతి(19)ని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. ఆ యువకుడు ఒక రైస్ మిల్లులో ఒక గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ఒక ధనిక కుటుంబానికి చెందినది. దీంతో వారి ప్రేమకు ఆస్తి, అంతస్తులు అడ్డుగోడగా మారాయి. అయినా ఆ ఇద్దరు ప్రేమికులు ఎలాగైనా ఒక్కటవ్వాలనుకొని.. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయారు. ఆ తరువాత యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరికోసం ఎంత వెతికినా దొరకలేదు. 


ఇటీవల ఒకరోజు ఆ యువతి తల్లి కొంత మందిని వెంట తీసుకొని యువకుడి ఇంట్లోకి బలవంతంగా వెళ్లి అతని తల్లి(45)ని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చింది. ఆ తరువాత చంటి సినిమాలో సీన్‌ను తలపించేలా ఆమె బట్టలు చింపేసి.. నగ్నంగా ఒక కరెంటు పోల్‌కి కట్టి చితకబాదారు. ఆ తరువాత స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలం తీసుకొని యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యువతి తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు.


Updated Date - 2022-02-01T06:48:46+05:30 IST