పదేళ్ల కొడుకు.. 6 నెలల నుంచి కనిపించడం లేదంటూ ఓ తల్లి ఫిర్యాదు.. పోలీసులకు వచ్చిన ఆ ఒక్క డౌట్తో సీన్ రివర్స్..!
ABN , First Publish Date - 2021-09-11T17:47:52+05:30 IST
ఆమె వివాహిత.. భర్త చనిపోవడంతో పదేళ్ల కొడుకుతో కలిసి నివసిస్తోంది.. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఆ కుమారుడు అదృశ్యమయ్యాడు..
ఆమె వివాహిత.. భర్త చనిపోవడంతో పదేళ్ల కొడుకుతో కలిసి నివసిస్తోంది.. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఆ కుమారుడు అదృశ్యమయ్యాడు.. ఆరు నెలలు వేచి చూసిన ఆ మహిళ ఇటీవలె పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.. ఆరు నెలల నుంచి కనిపించకపోతే ఇప్పటివరకు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదని పోలీసులకు డౌట్ వచ్చింది.. దర్యాఫ్తు చేయగా అసలు విషయం బయటపడింది.. ప్రియుడు సహాయంతో ఆ మహిళ కన్న కొడుకునే చంపేసిందని తేలింది.. బెంగళూరులో ఈ ఘటన జరిగింది.
బెంగళూరులో నివసిస్తున్న మహిళ గత నెలలో పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన అదృశ్యమయ్యాడని తెలిపింది. ఆరు నెలల క్రితం మిస్ అయితే ఇప్పటివరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె ఏవేవో సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పేసింది.
10 మంది భార్యలు.. వేరు వేరు సిటీల్లో కాపురాలు.. విమానాల్లోనే జర్నీలు.. పెద్ద బిజినెస్మన్ అని అనుకుంటున్నారేమో..!
అర్జెంట్గా ఫోన్ చేసుకోవాలి.. ప్లీజ్.. అంటూ మార్కెట్లో ఓ కుర్రాడు అడగడంతో సరేనని మొబైల్ ఇచ్చాడో వ్యక్తి.. చివరకు..
భర్త చనిపోయిన తర్వాత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని, తమ సంబంధాన్ని తన కొడుకు వ్యతిరేకించేవాడని, అందుకే అతడిని చంపేశామని అంగీకరించింది. చంపిన తర్వాత కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి అడవిలో పారేశామని చెప్పింది. ఆ హత్యలో తను, తన ప్రియుడు, మరో మహిళ పాల్గొన్నట్టు చెప్పింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.