2022లో లక్ష కోట్లు దాటిన ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-06-13T09:41:43+05:30 IST

2022లో లక్ష కోట్లు దాటిన ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ

2022లో లక్ష కోట్లు దాటిన ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ మదుపరుల నిఽ దుల ఉపసంహరణ నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది. జూన్‌ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఉపసంహరించిన నిధులు రూ.13888 కోట్లు. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటివరకు వారు ఉపసంహరించిన నిధుల పరిమాణం రూ.1.18 లక్షల కోట్లు. రాబోయే కాలంలో కూడా ఈ నిధుల ఉపసంహరణ కొనసాగే ఆస్కారం ఉన్నదని, అయితే మధ్యకాలంలో   మాత్రం అమ్మకాల జోరు తగ్గవచ్చునని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.


దేశంలో ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితులు, ప్రపంచ దేశా ల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్యవిధానం, అధిక ద్రవ్యోల్బణం ఇందుకు కారణాలని విశ్లేషకులంటున్నారు. ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్యవిధానంలో ఈ ఏడాది  ద్రవ్యోల్బణం 6 శాతం పైబడే ఉండవచ్చునని అంచనావేసింది. మూడు త్రైమాసికాల పాటు ఆర్థిక రంగంలో మందగమం ఉన్నట్టయితే బాండ్లపై రాబడులు కూడా తగ్గుతాయని, ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణకు ఇది కూడా ఒక కారణమని అంటున్నారు. ఈ నిధుల ఉపసంహరణ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రంగానే పడింది. ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్లో ఆటుపోట్లు పెరిగి సూచీలన్నీ కనిష్ఠ స్థాయిలకు దిగజారడానికి కూడా ఈ నిధుల ఉపసంహరణే కారణం. 

Updated Date - 2022-06-13T09:41:43+05:30 IST